వక్ఫ్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2022-02-23T08:21:21+05:30 IST

వక్ఫ్‌ బోర్డు సభ్యు ల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా

వక్ఫ్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు

సభ్యుల నియామకాలపై కౌంటర్‌ దాఖలుకు ఆదేశం


అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ బోర్డు సభ్యు ల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న మైనార్టీ సంక్షేమశాఖ ము ఖ్యకార్యదర్శి, వక్ఫ్‌బోర్డు సీఈవో అలీం బాషా, 8 మంది సభ్యులు, సీబీఐ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ మహ్మద్‌ ఈ పిల్‌ వేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాజారెడ్డి కోనేటి వాదనలు వినిపిస్తూ...వక్ఫ్‌ చట్టంలో సెక్షన్‌ 14 ప్రకారం సభ్యుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. ప్రస్తుత బోర్డు సభ్యులకు వక్ఫ్‌ చట్టానికి అనుగుణంగా తగిన అర్హతలు లేవన్నారు.  

Updated Date - 2022-02-23T08:21:21+05:30 IST