నల్ల రిబ్బన్లతో హైకోర్టు ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2022-01-25T08:46:47+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులకు నిరసనగా హైకోర్టు ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. రోజువారీ విధులకు హాజరవుతూనే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులకు నిరసనగా హైకోర్టు ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. రోజువారీ విధులకు హాజరవుతూనే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు మాట్లాడుతూ.. రిటైర్డ్ ఐఏఎస్ అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికలో ఉన్న సిఫార్సులకు అనుగుణంగా పీఆర్సీ నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.