దళితులకు ఇచ్చే పథకాలను వైసీపీ రద్దు చేసింది: హర్షకుమార్
ABN , First Publish Date - 2022-06-12T21:35:03+05:30 IST
దళితులకు ఇచ్చే పథకాలను వైసీపీ రద్దు చేసిందని మాజీ ఎంపీ హర్షకుమార్ దుయ్యబట్టారు.
రాజమండ్రి: దళితులకు ఇచ్చే పథకాలను వైసీపీ రద్దు చేసిందని మాజీ ఎంపీ హర్షకుమార్ దుయ్యబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు హత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను ఏకతాటిపైకి తెచ్చి దళిత సింహగర్జన చేపడతామని ప్రకటించారు. సెప్టెంబర్లో భారీ ఎత్తున దళిత సింహగర్జన నిర్వహిస్తామని హర్షకుమార్ తెలిపారు.