GVMC council: వైసీపీలో బయటపడ్డ విభేదాలు
ABN , First Publish Date - 2022-05-26T19:01:26+05:30 IST
జీవీఎంసీ కౌన్సిల్ సమావేవంలో వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి.
విశాఖపట్నం: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. మేయర్ గొలగాని హరివెంకట కుమారి తీరుపై వైసీపీ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు తిప్పల వంశీ రెడ్డి మండిపడ్డారు. అంశాలపై చర్చించకుండా ఎలా ఆమోదించుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కాటుమూరి సతీష్, వంశీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీ నిర్ణయాలను ఉల్లంఘిస్తూ పార్టీకి హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ సతీష్ ఆగ్రహించారు. ‘‘నా హక్కును నేను ప్రశ్నిస్తున్నాను తప్ప పార్టీని ధిక్కరించడం లేదు’’ అని వంశీ స్పష్టం చేశారు. వంశీ తీరును ప్రతిపక్షాలు పూర్తిగా సమర్ధించాయి.