గుంటూరులో దారుణం

ABN , First Publish Date - 2022-04-15T13:36:10+05:30 IST

జిల్లాలోని పొన్నూరులో దారుణం జరిగింది.

గుంటూరులో దారుణం

గుంటూరు: జిల్లాలోని పొన్నూరులో దారుణం జరిగింది. కన్న తండ్రి కోటేశ్వరరావు(52)ను కొడుకు శశిధర్‌ కుమార్‌(21) సుత్తితో కొట్టి హత్య చేశాడు. మద్యం తాగి వచ్చి తండ్రి గొడవ చేస్తున్నాడంటూ కొడుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొన్నూరులోని 14వ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-15T13:36:10+05:30 IST