Gorantla Madhav: గోరంట్ల మాధవ్కు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-08-15T21:51:53+05:30 IST
ఏపీలో ఎంపీ మాధవ్ (Gorantla Madhav) వీడియో కాల్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ‘నేను బలహీనవర్గానికి చెందినవాడిని.
హిందూపురం: ఏపీలో ఎంపీ మాధవ్ (Gorantla Madhav) వీడియో కాల్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ఆయనకు ఇంకా నిరసన సెగ తగులుతోంది. చౌళూరులో మాధవ్ కాన్వాయ్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ‘ఎంపీ మాధవ్ గో బ్యాక్’ అంటూ టీడీపీ (TDP) కార్యకర్తల నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నగ్న వీడియో బహిర్గతమైన తర్వాత తొలిసారి మాధవ్ ఆదివారం అనంతపురానికి వచ్చారు. వైసీపీ (YCP) కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నప్పటికీ.. దానిని ఉల్లంఘించి పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు బాగా అంతరాయం ఏర్పడింది. అయితే మాధవ్ సామాజిక వర్గం కురుబ సంఘాల ముఖ్య నేతలెవరూ కనబడలేదు.