జీజీహెచ్లో మరోసారి అక్రమ వసూళ్ల వివాదం
ABN , First Publish Date - 2022-05-30T17:41:04+05:30 IST
జీజీహెచ్లో మరోసారి అక్రమ వసూళ్ల వివాదం రాజుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆమె బిడ్డను ఇచ్చేందుకు రూ.2వేలు వసూలు చేశారు.
గుంటూరు : జీజీహెచ్లో మరోసారి అక్రమ వసూళ్ల వివాదం రాజుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆమె బిడ్డను ఇచ్చేందుకు రూ.2వేలు వసూలు చేశారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్కు మరో రూ.2వేలు అదనంగా డిమాండ్ చేశారు. డబ్బులు అడిగే వారిని బాలింత భర్త ఫొటోలు తీశారు. భర్తపై దాడికి యత్నించి సిబ్బంది సెల్ఫోన్ పగలగొట్టారు. డబ్బులు ఇవ్వకపోతే బాలింత ఫొటోలు తీస్తామని బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.