Amarnathreddy: తప్పుల్ని ప్రశ్నించిన వారిపై.. తప్పుడు కేసులా?
ABN , First Publish Date - 2022-10-14T19:29:18+05:30 IST
తప్పుల్ని ప్రశ్నించిన వారిపై.. తప్పుడు కేసులా? అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు.
అమరావతి: తప్పుల్ని ప్రశ్నించిన వారిపై.. తప్పుడు కేసులా? అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి (Amarnath reddy) ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పిచ్చి ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి (jagan reddy) చరిత్రలో నిలిచిపోవడం ఖాయమన్నారు. ప్రభుత్వ తప్పుల్ని, ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటడమే నేరమా అని నిలదీశారు. తప్పుడు కేసులతో వేధింపులు జగన్ రెడ్డి (AP CM) పిరికితనానికి నిదర్శనమన్నారు. ఎగ్జిబిషన్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) ప్రజల నుండి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. అతనిపై కేసు పెట్టకుండా.. ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్పై కేసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి(YCP Chief) లాంటి దొంగలకు నిజాలు నచ్చవని మరోసారి రుజువైందన్నారు. నిరంకుశత్వం, నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని అమర్నాథ్ రెడ్డి (Former minister) అన్నారు.