AP News: వైసీపీ నేతలకు రైతుల నిరసన సెగ

ABN , First Publish Date - 2022-09-19T17:27:21+05:30 IST

అమరావతి (Amaravathi): వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రైతుల నిరసన సెగ తగిలింది.

AP News: వైసీపీ నేతలకు రైతుల నిరసన సెగ

అమరావతి (Amaravathi): వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రైతుల నిరసన సెగ తగిలింది. సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడ దూకి ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి రైతులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా రైతుల ఆందోళనతో అసెంబ్లీ-సచివాలయం మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ జామ్‌లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు ఇరుక్కుపోయాయి. ఎస్కార్ట్ వాహనాల సైరన్ మోతలతో అసెంబ్లీ పరిసరాలు మార్మోగాయి. ట్రాఫిక్ క్లియర్ చేసే వరకూ అసెంబ్లీకి వెళ్లే మార్గం లేక ప్రజాప్రతినిధులు వాహనాల్లోనే కూర్చుండిపోయారు. 

Updated Date - 2022-09-19T17:27:21+05:30 IST