జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పదవీ కాలం పొడిగింపు
ABN , First Publish Date - 2022-09-17T09:15:38+05:30 IST
జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పదవీ కాలం పొడిగింపు
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ న్యాయకమిషన్ (జ్యుడీషియల్ ప్రివ్యూ) జడ్జి జస్టిస్ బి.శివశంకర రావు పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ల నిర్వహణలో పారదర్శకత తీసుకొచ్చేందుకు 2019లో జ్యుడీషియల్ ప్రివ్యూను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.