మాజీ మంత్రి అయ్యన్న ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-02-24T03:18:28+05:30 IST
నర్సీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి అయ్యన్న ఇంటి వద్ద మరోసారి పోలీసులు మోహరించారు. ఇప్పటికే..
విశాఖ: నర్సీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి అయ్యన్న ఇంటి వద్ద మరోసారి పోలీసులు మోహరించారు. ఇప్పటికే అదనపు బలగాలు నర్సీపట్నం చేరుకున్నాయి. ఈ రాత్రికి అరెస్టు చేస్తారంటూ పుకార్లు వ్యాపించాయి. దీంతో అయ్యన్న ఇంటికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.