స్వయం ఉపాధి పొందుతున్నవారికీ ఈపీఎఫ్!
ABN , First Publish Date - 2022-08-31T09:03:18+05:30 IST
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పరిధిని మరింత విస్తృతం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం
పథకంలో మార్పులకు కేంద్రప్రభుత్వం యోచన
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పరిధిని మరింత విస్తృతం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పరిమితులను తొలగించాలని యోచిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెల జీతం రూ.15,000 (బేసిక్+డీఏ) మించిన ఉద్యోగులు, 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు మాత్రమే ఈపీఎఫ్ పరిధిలోకి వస్తాయి. అయితే.. స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న వ్యక్తులకూ ఈ పథకాన్ని విస్తరింపజేసేలా కేంద్రం ఈపీఎ్ఫలో మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. దీని ద్వారా లబ్ధిదారులకు ఎంతో కొంత ఆర్థిక భద్రత లభిస్తుంది. జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు బీమా రూపంలోనూ కొంత మొత్తం అందుతుంది.