ఫిబ్రవరి 17న దేవదాయ ఈవో మెయిన్స్‌ పరీక్ష

ABN , First Publish Date - 2022-12-31T05:58:40+05:30 IST

దేవదాయశాఖలో గ్రేడ్‌-3 ఈవో పోస్టులకు మెయిన్స్‌ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఫిబ్రవరి 17న దేవదాయ ఈవో మెయిన్స్‌ పరీక్ష

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖలో గ్రేడ్‌-3 ఈవో పోస్టులకు మెయిన్స్‌ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు 1,278 మంది అర్హత సాధించారని, విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు నాలుగు జిల్లాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వివరించింది. ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ.. మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పేపర్‌-2 హిందూ ఫిలాసఫీ, టెంపుల్‌ సిస్టం అంశాలపై పరీక్షలు జరుగుతాయని తెలిపింది.

Updated Date - 2022-12-31T05:58:41+05:30 IST