ఆర్టీసీ బస్సులో మహిళ బ్యాగ్ నుంచి బంగారం, నగదు మాయం
ABN , First Publish Date - 2022-05-21T18:28:18+05:30 IST
తెలంగాణ ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్ నుంచి బంగారం, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.
ఏలూరు: తెలంగాణ ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్ నుంచి బంగారం, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఓ శుభ కార్యక్రమం నిమిత్తం మహిళ రాజమండ్రి నుండి జంగారెడ్డిగూడానికి బస్సులో బయలుదేరారు. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్లో బస్ దిగి బ్యాగ్ చూసుకోగా ఖాళీగా వుండటంతో బాధితురాలు అవక్కైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బస్ను స్టేషన్కు తీసుకువచ్చి ప్రయాణికుల బ్యాగ్లను తనిఖీ చేస్తున్నారు.