రాజరాజేశ్వరిగా దుర్గమ్మ
ABN , First Publish Date - 2022-10-07T07:58:44+05:30 IST
రాజరాజేశ్వరిగా దుర్గమ్మ
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. విజయదశమి రోజున కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం వర్షం కురవడంతో కృష్ణానదిలో హంసవాహనంపై నిర్వహించే తెప్పోత్సవాన్ని, పూజల ప్రక్రియను రద్దు చేశారు. ఈ ప్రక్రియను మహామండపంలోని ఆరో అంతస్తులో శాస్త్రయుక్తంగా నిర్వహించారు.