బొట్టు పెట్టుకుంటే స్కూలుకు రావొద్దు

ABN , First Publish Date - 2022-04-10T08:27:02+05:30 IST

అన్యమత ప్రచారం చేస్తున్నాడనే ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు.

బొట్టు పెట్టుకుంటే స్కూలుకు రావొద్దు

ఉపాధ్యాయుడి హుకుం.. తల్లిదండ్రుల దేహశుద్ధి

రైల్వేకోడూరు రూరల్‌, ఏప్రిల్‌ 9: అన్యమత ప్రచారం చేస్తున్నాడనే ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. అన్నమయ్యజిల్లా వీపీఆర్‌ కండ్రిగ పంచాయతీలోని పెద్దరాజుపల్లెలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో సోషల్‌ ఉపాధ్యాయుడైన శ్రీనివాసులు..బొట్టు పెట్టుకుంటే తమను క్లాసులకు రానివ్వడంలేదని, అసభ్య పదజాలంతో దూషించేవాడని విద్యార్థినులు తెలిపారు. దేవుడి మార్గంలో నడిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని, లేకపోతే ఫెయిలవుతారని బెదిరించేవాడని తెలిపారు. అతనిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులకు చెప్పారు. గ్రామస్థులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీయగా, ఆగ్రహం వ్యక్తం చేయడంతో దేహశుద్ధి చేసి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు.

Updated Date - 2022-04-10T08:27:02+05:30 IST