ఇడుపులపాయలో విద్యార్థినులపై బెదిరింపులకు దిగుతారా?: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2022-03-21T17:27:54+05:30 IST
అర్ధరాత్రి ఆడపిల్లలను వాడుకలో లేని శిథిల భవనాలకు తరలింపు దుర్మార్గమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా విమర్శించారు.
అమరావతి : అర్ధరాత్రి ఆడపిల్లలను వాడుకలో లేని శిథిల భవనాలకు తరలింపు దుర్మార్గమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా విమర్శించారు. ఇడుపులపాయలో 6500 మంది విద్యార్థినులపై బెదిరింపులకు దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో కూడా వసతులు లేవంటూ విద్యార్థులను తరలించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇలాకాలో వసతి, భోజనం కోసం విద్యార్థినులు నిరసనకు దిగారని... మీ పాలనా వైఫల్యానికి ఇది నిదర్శనం కాదా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.