Vidyanidi scheme పేరు మార్పుపై దళిత నేతల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-07-16T18:11:16+05:30 IST
అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్య దీవెనగా పేరు మార్పుపై అమరావతి దళిత నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్య దీవెనగా పేరు మార్పుపై అమరావతి దళిత నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఅర్ అంబేద్కర్ పేరు తొలగించి తనపేరు ఎలా పెట్టుకుంటారంటూ నిరసనకు దిగారు. దళిత రైతులు,నేతలు తుళ్ళూరు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. అంబేద్కర్ పేరు ఈ పథకానికి కొనసాగిస్తూ మరో ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.