ఎన్టీఆర్ జిల్లాలో సీపీఎం నేత Madhu అరెస్ట్
ABN , First Publish Date - 2022-06-18T19:15:29+05:30 IST
జిల్లాలోని కంచికచర్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలం వద్ద సీపీఎం నేత మధును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్టీఆర్: జిల్లాలోని కంచికచర్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలం వద్ద సీపీఎం నేత మధు(Madhu)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, సీపీఎం నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో నిరసన చేస్తున్న సీపీఎం నాయకులను నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి కంచికచర్ల రూరల్ కార్యలయానికి తరలించారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన సీపీఎం నాయకుడు మధు, పార్టీ నాయకులు అరెస్టు చేసి వీరులపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.