ఈడీ దాడులపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-11-24T13:44:29+05:30 IST
ఈడీ దాడులపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ ఎక్కడ దాడులు చేసినా వాళ్ల వద్ద ఉన్న కెమెరాలతో లైవ్ పెట్టాలన్నారు.
Tirupathi : ఈడీ దాడులపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ ఎక్కడ దాడులు చేసినా వాళ్ల వద్ద ఉన్న కెమెరాలతో లైవ్ పెట్టాలన్నారు. అలా చేస్తే లోపల ఏమి జరుగుతోందో? అందరికీ తెలుస్తుందని... అక్రమాలన్నీ బయటపడతాయని నారాయణ పేర్కొన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీల పైనా.. వ్యాపార సంస్థలపైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైవ్ పెట్టకపోతే ఈడీ దాడులను కేంద్ర కక్ష సాధింపు చర్య అని చెప్పాల్సి వస్తుందని నారాయణ పేర్కొన్నారు.