రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: Ramakrishna
ABN , First Publish Date - 2022-01-01T13:39:34+05:30 IST
రాష్ట్ర ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: రాష్ట్ర ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా మూడో దశ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఏడాదిలోనైనా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలని రామకృష్ణ కోరారు.