కొవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గింది: మంత్రి రోజా
ABN , First Publish Date - 2022-04-26T23:00:16+05:30 IST
కొవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గిందని మంత్రి రోజా తెలిపారు. మంగళవారం బోధిసిరి బోట్ను పునఃప్రారంభించారు.
విజయవాడ: కొవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గిందని మంత్రి రోజా తెలిపారు. మంగళవారం బోధిసిరి బోట్ను పునఃప్రారంభించారు. ఈసందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. బోటు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 9 ప్రాంతాల్లో కంట్రోల్రూమ్ ద్వారా బోట్స్ మానిటర్ చేస్తున్నామని చెప్పారు. పాపికొండలు బోటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని రోజా పేర్కొన్నారు.