Tadimarri సబ్స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-30T19:26:55+05:30 IST
జిల్లాలోని తాడిమర్రి సబ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి సబ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సబ్ స్టేషన్ను ముట్టడించేందుకు ఆటో ప్రమాద మృతుల బంధువులు యత్నించారు. టీడీపీ పరిటాల శ్రీరామ్ బాధితులకు మద్దతు తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రూ.50లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఉద్యోగం కల్పించాలని పరిటాల శ్రీరాం డిమాండ్ చేశారు.
కాగా... సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మంటల్లో ఆటో పూర్తి కాలి బూదిదైంది. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్ల వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.