మంత్రులు, వైసీపీ సభ్యులతో సీఎం జగన్ సమావేశం
ABN , First Publish Date - 2022-03-14T17:04:46+05:30 IST
టీడీపీ సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ తమ్మినేని సభకు కాసేపు టీ బ్రేక్ ఇచ్చారు.

అమరావతి: టీడీపీ సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ తమ్మినేని సీతారం సభకు కాసేపు టీ బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో సభలోనే మంత్రులు, వైసీపీ సభ్యులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. జంగారెడ్డిగూడెం ఘటనపై సభను టీడీపీ అడ్డుకుంటోన్న తీరుపై చర్చ జరుగుతోంది. సభలో ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నారు.