Cm Jagan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ తొలి గెలుపు కుప్పం కావాలి
ABN , First Publish Date - 2022-08-05T03:02:13+05:30 IST
వచ్చే ఎన్నికల్లో వైసీపీ (Ycp) తొలి గెలుపు కుప్పం (Kuppam) కావాలని సీఎం జగన్ (Cm Jagan) అన్నారు. కుప్పం కార్యకర్తలతో...
అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైసీపీ (Ycp) తొలి గెలుపు కుప్పం (Kuppam) కావాలని సీఎం జగన్ (Cm Jagan) అన్నారు. కుప్పం కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy)తో పాటు కుప్పం ఇన్చార్జ్ భరత్, 50 మంది కార్యకర్తలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా భరత్ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. పులివెందుల మాదిరిగానే కుప్పంను అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.