Jagan mohanreddy: బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2022-08-10T19:42:03+05:30 IST
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతులపై జగన్ ఆరా తీశారు. అన్ని హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలన్నారు. పిల్లలకు ఇచ్చే ఆహార మెనును మెరుగుపరచాలని సూచించారు. 3 వేల హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.