జగ్జీవన్ రామ్కు చంద్రబాబు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-04-05T16:54:37+05:30 IST
సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళి అర్పించారు.
అమరావతి: సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్యమూర్తి.జగ్జీవన్ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేద్దాం.దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టే ప్రభుత్వంపై పోరాడాల్సిన పరిస్థితి.దళితుల భవిష్యత్ కాలరాస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధపడాలి.దళితుల భవిష్యత్కు భరోసా ఇవ్వడమే జగ్జీవన్కు మనమందించే నివాళి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.