ఎంపీ కేశినేన నాని క్వశ్చన్.. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆన్సర్
ABN , First Publish Date - 2022-02-03T00:41:40+05:30 IST
దేశంలో ప్రస్తుతం రెండు జతల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు మాత్రమే నడుస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ..
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం రెండు జతల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు మాత్రమే నడుస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో విజయవాడ ఎంపీ కేసినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఆయన సమాధానం ఇచ్చారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను రాష్ట్రాల వారీగా నడిపే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి రైల్వే శాఖ వద్ద లేదని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-తిరుపతి, విజయవాడ-విశాఖపట్నం సెక్టార్లలో ఇప్పటికిప్పుడు వందే భారత్ నడిపే నిర్ణయం ఏదీ రైల్వే శాఖ వద్ద లేదన్నారు. ఫీజిబిలిటీ, కోచ్ల వెసులుబాటు, లాభం... వంటి అంశాల ఆధారంగా వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.