మంగళగిరిలో ఎస్సైపై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-05-01T00:06:19+05:30 IST
వరకట్నం వేధింపుల కేసులో జిల్లాలోని మంగళగిరి రూరల్
గుంటూరు: వరకట్నం వేధింపుల కేసులో జిల్లాలోని మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఎస్సై వినోద్కుమార్పై కేసు నమోదయింది. వరకట్నం వేధింపులపై పోలీసులకు ఎస్సై భార్య రోజారాణి ఫిర్యాదు చేసింది. ఎస్సైకి కట్నంగా రూ.20 లక్షలు, 12 లక్షల బంగారు నగలు కట్నం ఇచ్చిన రోజారాణి కుటుంబం ఇచ్చింది. అయినా అదనపు కట్నం కోసం రోజారాణికి అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త, అత్తమామలు తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజారాణి తాడేపల్లిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నది. రోజారాణి ఫిర్యాదుతో ఎస్సైపై మంగళగిరి పీఎస్లో కేసు నమోదయింది.