Posani Krishna Murali: పోసానిపై కేసు

ABN , First Publish Date - 2022-11-19T21:34:45+05:30 IST

సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali)పై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది.

Posani Krishna Murali: పోసానిపై కేసు

రాజమహేంద్రవరం: సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali)పై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున జనసేన అధినతే పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)పై పోసాని సోషల్‌ మీడియా, ప్రచార మాధ్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజమహేంద్రవరం జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీర మహిళ యందం ఇందిర గతంలో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను పోసాని చాలా దారుణంగా దూషించారని తమ మనోభావాలు దెబ్బతిన్నాయని యందం ఇందిర పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పుడు దీనిపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీంతో ఇందిర పోసానిపై కేసు నమోదు చేయాలని రాజమహేంద్రవరం రెండో జెఎఫ్‌సీఎం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరు శనివారం పోలీసులు పోసానిపై ఐపీసీ 354, 355, 500, 506, 507, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-19T21:36:12+05:30 IST