విభజనతో ఏపీ రాజధానిని కూడా కోల్పోయింది: జగన్
ABN , First Publish Date - 2022-01-04T00:45:29+05:30 IST
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటపాటు ప్రధానితో జగన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధానికి
ఢిల్లీ: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటపాటు ప్రధానితో జగన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధానికి సీఎం నివేదించారు. ఈ మేరకు మోదీకి జగన్ విజ్ఞాపన పత్రం అందించారు. రాష్ట్ర విభజన ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయని తెలిపారు. విభజన సమయంలో 58శాతం జనాభా ఏపీకి రాగా.. ఏపీకి కేవలం 45శాతం రెవెన్యూ మాత్రమే దక్కిందని జగన్ చెప్పారు. విభజనతో ఏపీ రాజధానిని కూడా కోల్పోయిందన్నారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను కోల్పోయామని వివరించారు. అందుకే విభజన సమయంలో ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలిచ్చారని గుర్తుచేశారు. వాటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుందని, కానీ చాలా హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ప్రధానికి జగన్ వివరించారు.