గుండెపోటుతో రాజధాని మహిళా రైతు మృతి
ABN , First Publish Date - 2022-10-15T09:30:48+05:30 IST
గుండెపోటుతో రాజధాని మహిళా రైతు మృతి
తుళ్లూరు, అక్టోబరు 14 : మూడు రాజధానులంటూ వెసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల గోల చేయటంతో రాజధాని మహిళా రైతు ఎర్రగోపు శేషమ్మ(62) శుక్రవారం మనోవేదన చెంది గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి చెందారు. రాజధాని గ్రామం ఐనవోలుకు చెందిన శేషమ్మ తనకున్న అర ఎకరం భూమిని రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారు. రైతుల మహాపాదయాత్రను అడ్డుకోవడానికి అధికార వైసీపీ మూడు రాజధానులంటూ గందరగోళం చేయటం, ఆ సన్నివేశాలను ప్రసారమాధ్యమాలలో చూసిన ఆమె శుక్రవారం తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. బంధువులు ఆస్పత్రికి తరలించడంతో గుండెపోటుతో మృతి చెందారు.