ఇదో మోసపూరిత బడ్జెట్: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2022-03-11T21:37:13+05:30 IST
ఇదో మోసపూరిత బడ్జెట్ అని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా..
అమరావతి: ఇదో మోసపూరిత బడ్జెట్ అని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. అందుకు తగిన రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని తప్పుబట్టారు. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందన్నారు. బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.