ఏపీలో బస్సు ఎక్కాలంటే డీజిల్ సెస్ కట్టాల్సిందే: Lanka dinakar
ABN , First Publish Date - 2022-07-01T16:25:50+05:30 IST
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే డీజిల్ సెస్ కట్టాల్సిందే అని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.
అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే డీజిల్ సెస్ కట్టాల్సిందే అని బీజేపీ నేత లంకా దినకర్(Lanka dinakar) అన్నారు. రెండు సార్లు కేంద్రం డీజీల్, పెట్రోల్పైన సుంకం, సెస్సులను తగ్గిస్తే... ఆర్టీసీ టికెట్లపైన జగనన్న డీజీల్ సెస్ను అధనంగా భారం వేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజల ప్రయాణ వ్యయం తడిసిమోపెడు అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రజోపయోగ సంస్థల సేవలపైన ప్రజలకు డీజీల్సెస్ మినహాయింపు ఇవ్వాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు.