రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉంది: భూమన
ABN , First Publish Date - 2022-07-05T22:22:09+05:30 IST
రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉంది: భూమన
కర్నులు: 2016-19 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల సమాచారం సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందని వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేట్ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసిందని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉందని తెలంగాణ సర్కార్ కూడా దర్యాప్తు జరిపిందన్నారు. అవసరమైతే కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు.