పావురాలతో.. పందేలు?
ABN , First Publish Date - 2022-01-30T08:42:26+05:30 IST
శనివారం ఉదయం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్దకు ఐదుగురు వ్యక్తులు పెద్ద పెద్ద బాక్సులతో వచ్చారు.
అద్దంకి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : శనివారం ఉదయం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్దకు ఐదుగురు వ్యక్తులు పెద్ద పెద్ద బాక్సులతో వచ్చారు. చెన్నై నుంచి వచ్చిన వీరు తమ వద్ద ఉన్న బాక్సుల్లోని 400కు పైగా పావురాళ్లను గాల్లోకి విడిచిపెట్టా రు. వాటి కాళ్లకు నంబర్లు వేసి ఉన్నాయి. వాటిని విడిచిపెట్టే ముందు వీడియో కాల్లో చెన్నైలో ఉన్న వ్యక్తులకు చూపించారు. వదిలిన పావురాలన్నీ చెన్నై వైపు గాల్లోకి ఎగిరిపోయాయి.
అయితే వీటిని పందేల కోసం వదిలారా? శిక్షణ ఇస్తున్నారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక సీఐ రాజేశ్ను వివరణ కోరగా చెన్నైలోని ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన పావురాళ్లను శిక్షణ కోసం తీసుకొచ్చినట్లు సంబంధిత వ్యక్తులు చెప్పారని ఆయన తెలిపారు.