రెండు జిల్లాల్లో రేపటి నుంచి బాబు పర్యటన

ABN , First Publish Date - 2022-12-07T02:43:25+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు.

రెండు జిల్లాల్లో రేపటి నుంచి బాబు పర్యటన

8న పొన్నూరులో బహిరంగ సభ.. 9న బాపట్ల, 10న చీరాలలో

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం (8వ తేదీ) నుంచి మూడ్రోజులపాటు పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అన్న కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాల యాత్రలు చేపట్టిన విషయం తెలిసిందే. మొదటి విడతలో కర్నూలు, రెండో విడతలో గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఇప్పుడు గుంటూరు, బాపట్ల జిల్లాలకు వెళ్తున్నారు. గురువారం మొదట గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి వెళ్తారు. మార్గమధ్యంలో ఒక చోట రైతులను కలిసి మాట్లాడతారు. ఆ రోజు రాత్రి పొన్నూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడే బస చేస్తారు. మర్నాటి ఉదయం అక్కడ ముస్లిం మైనారిటీ వర్గాలతో సమావేశమవుతారు. తర్వాత బాపట్లలో సభలో పాల్గొని ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. పదో తేదీ ఉదయం అక్కడ మత్స్యకార వర్గాలతో భేటీ అవుతారు. అదే రోజు చీరాల వెళ్తారు. సాయంత్రం రోడ్‌ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. అంతటితో ఆయన పర్యటన ముగుస్తుంది.

Updated Date - 2022-12-07T02:43:26+05:30 IST