జగన్, బొత్సపై టీడీపీ మాజీ మంత్రి Ayyanna ఫైర్
ABN , First Publish Date - 2022-06-10T01:34:56+05:30 IST
Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యావిధానం సర్వ
Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యావిధానం సర్వ నాశనమైందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 2018, 2019లో పదో తరగతి విద్యార్థులు 97%,94% ఉత్తీర్ణత సాధిస్తే...ఇప్పుడు 67 శాతం సాధించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థిని ఇంగ్లీషులో మాట్లాడితే.. అది తమ ప్రభుత్వ గొప్పదనమని వైసీపీ నాయకులు చెప్పుకున్నారని, అయితే అదే విద్యార్థిని పది ఫెయిల్ అవ్వడంతో విద్యా విధానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. 2.70 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, వీరికి అమ్మ ఒడి ఇవ్వాల్సి వస్తుందని ఫెయిల్ చేశారా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఫీజు కట్టించుకోకుండా రీ వాల్యువేషన్ చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ను తాము సమర్థిస్తున్నామన్నారు. పాఠశాలల్లో నాడు - నేడు పేరుతో రూ.16 వేల కోట్లు ఖర్చు చేశారని, అయితే ఈ పనులన్ని కడపకు చెందిన కాంట్రాక్టర్లే చేశారని తెలిపారు.