AP Assembly: ప్రజా సంక్షేమానికి రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశాం: జగన్
ABN , First Publish Date - 2022-09-15T22:26:10+05:30 IST
ప్రజా సంక్షేమానికి రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ (CM Jagan) ప్రకటించారు. అసెంబ్లీ (Assembly)లో జగన్ మాట్లాడుతూ
అమరావతి: ప్రజా సంక్షేమానికి రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ (CM Jagan) ప్రకటించారు. అసెంబ్లీ (Assembly)లో జగన్ మాట్లాడుతూ లక్షా 65 వేల కోట్లను బటన్ నొక్కి ఖర్చు చేశామని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) హయాంలో సంక్షేమ పథకాలు, పేదలకు పక్కా ఇళ్లు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ‘దోచుకో.. దాచుకో.. పంచుకో’ ఇదే నాటి టీడీపీ (TDP) సిద్ధాంతమని తప్పుబట్టారు. రాజధాని నిర్మాణానికి 4-5 లక్షల కోట్లు అవుతాయని చంద్రబాబే అన్నారని, ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున లక్షా 10 వేల కోట్లు.. అవసరం అవుతాయని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ప్రతిపక్షంలోనూ తన మనుషులే ఉండాలని చంద్రబాబు కోరుకుంటారని జగన్ విమర్శించారు.