15 నుంచి అంగన్వాడీల దీక్షలు
ABN , First Publish Date - 2022-03-05T08:10:47+05:30 IST
అంగన్వాడీలకు తెలంగాణలో మాదిరి వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలన్నీ పరిష్కరించాలని ..
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలకు తెలంగాణలో మాదిరి వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఈ నెల 15 నుంచి మూడు రోజులపాటు సామూహిక దీక్షలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబి రాణి, సుబ్బరావమ్మ తెలిపారు. శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.