15 నుంచి అంగన్వాడీల దీక్షలు

ABN , First Publish Date - 2022-03-05T08:10:47+05:30 IST

అంగన్వాడీలకు తెలంగాణలో మాదిరి వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలన్నీ పరిష్కరించాలని ..

15 నుంచి అంగన్వాడీల దీక్షలు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలకు తెలంగాణలో మాదిరి వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో ఈ నెల 15 నుంచి మూడు రోజులపాటు సామూహిక దీక్షలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబి రాణి, సుబ్బరావమ్మ తెలిపారు. శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. 

Updated Date - 2022-03-05T08:10:47+05:30 IST