మండుతున్న మిర్చి ధర
ABN , First Publish Date - 2022-02-19T09:35:26+05:30 IST
పచ్చి మిర్చి ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్సేల్గానే కూరల్లో వాడే సన్న రకం కిలో రూ.80, బజ్జీలకు వాడే లావు కాయలు....
సన్నకాయ రూ.80, లావు రకం రూ.100
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పచ్చి మిర్చి ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్సేల్గానే కూరల్లో వాడే సన్న రకం కిలో రూ.80, బజ్జీలకు వాడే లావు కాయలు రూ.100 పలుకుతున్నాయి. రిటైల్గా పావు కిలో సన్నమిర్చి రూ.25 చెప్తున్నారు. రైతుబజార్లలో రూ.60-70 చొప్పున అమ్ముతున్నారు. తెగుళ్లతో మిర్చి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ వచ్చింది. మూడు నెలల కిందట కిలో రూ.40కి మించని పచ్చిమిర్చి ధర ఇప్పుడు రెట్టింపు అయింది.