తెగేదాకా లాగొద్దు
ABN , First Publish Date - 2022-01-23T08:34:38+05:30 IST
తెగేదాకా లాగొద్దు
ప్రభుత్వానికి సీపీఐ నారాయణ సూచన
తిరుపతి(కల్చరల్), జనవరి 22: ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలో తెగేదాకా లాగొద్దని ప్రభుత్వానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఒక ప్రకటనలో సూచించారు. పీఆర్సీ వ్యవహారంలో ప్రభుత్వంపై భ్రమలు తొలగి ఉద్యోగులు పోరుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఒక మెట్టు దిగి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలన్నారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని ఉద్యోగ సంఘాలు అనడాన్ని నారాయణ తప్పు బట్టారు. ఉద్యోగ సంఘాలను ఏ రాజకీయ పార్టీ ఉపయోగించుకుంటుందో సంఘాల నాయకులు గుర్తించాలని కోరారు. అదే సందర్భంలో రాజకీయ పార్టీలను అంటరానివిగా చూడడం ఉద్యోగ సంఘాలకు సరైంది కాదన్నారు.