డాక్టర్కు వైసీపీ నేతల బెదిరింపులు
ABN , First Publish Date - 2022-06-29T23:10:49+05:30 IST
డాక్టర్ అచ్చమాంబకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తోన్నాయి. గుంటూరువారితోటలో బిల్దింగ్ను డాక్టర్ 9 ఏళ్లకు లీజుకు తీసుకున్నాడు.

గుంటూరు: డాక్టర్ అచ్చమాంబకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తోన్నాయి. గుంటూరువారితోటలో బిల్దింగ్ను డాక్టర్ 9 ఏళ్లకు లీజుకు తీసుకున్నాడు. అయితే మూడేళ్ల గడువు ఉండగానే బిల్డింగ్ను రమణారెడ్డి స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ ఆరోపిస్తున్నారు. వైసీసీ నేతల అండతో ఆయనపై దౌర్జన్యం చేస్తూ... బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. డాక్టర్. అచ్చమాంబ ఫిర్యాదు చేసినా.. కొత్తపేట పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డాక్టర్. అచ్చమాంబ ఎస్పీని ఆశ్రయించారు.