విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం
ABN , First Publish Date - 2022-05-18T03:01:48+05:30 IST
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం
కృష్ణా: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. విజయవాడ రూరల్ మండలం నున్నలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులో డ్రగ్స్ విక్రయించే వ్యక్తితో యువకులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యశ్వంత్రెడ్డి, ఏకేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో వున్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఆన్లైన్లో కర్నూలు వాసి డ్రగ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కర్నూలు వాసికి నిందితులు రీటైలర్లుగా వ్యవహరిస్తున్నారు.