‘లోన్యాప్ ఆగడాలు మరింత పెరిగాయి’
ABN , First Publish Date - 2022-09-08T21:49:54+05:30 IST
‘లోన్యాప్ ఆగడాలు మరింత పెరిగాయి’
అమరావతి: వైసీపీ పాలనలో లోన్యాప్ ఆగడాలు మరింత పెరిగాయని టీడీపీ నేత ఆచంట సునీత మండిపడ్డారు. లోన్యాప్ ఆగడాలను ప్రభుత్వం అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. లోన్యాప్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో నేరాలు షరా మాములయ్యాయని ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.