అనంతబాబు కేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్పై విచారణ
ABN , First Publish Date - 2022-12-12T20:39:37+05:30 IST
ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha babu) కేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టు (AP Highcourt) లో విచారణ జరిగింది.
అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha babu) కేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టు (AP Highcourt) లో విచారణ జరిగింది. కేసు విచారణ సీబీఐకి ఇవ్వాలని హతుడు సుబ్రహ్మణ్యం తల్లి పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ తరపున లాయర్ జడ శ్రవణ్కుమార్ వాదించారు. అనంతబాబు తరపున లాయర్ సి.రఘు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాన్న అనంతరం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.