జగనన్న ఫింఛన్ ఇప్పిస్తానని ఘరానా మోసం
ABN , First Publish Date - 2022-11-24T19:02:27+05:30 IST
నగరంలో ఘరానా మోసానికి దుండగులు పాల్పడ్డారు. జగనన్న ఫింఛన్ ఇప్పిస్తానని వృద్దురాలికి మాయ మాటలు చెప్పిన దుండగులు ఆమెను ఆటోలో తీసుకెళ్ళారు.
నంద్యాల: నగరంలో ఘరానా మోసానికి దుండగులు పాల్పడ్డారు. జగనన్న ఫింఛన్ ఇప్పిస్తానని వృద్దురాలికి మాయ మాటలు చెప్పిన దుండగులు ఆమెను ఆటోలో తీసుకెళ్ళారు. ఊరి బయటకు తీసుకెళ్ళి ఆ వృద్దురాలి వద్ద వున్న రూ.70 వేల విలువగల బంగారు చైన్ తీసుకొని అగంతకులు పరారయ్యారు. చోరీపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.