దారుణం... వాలంటరీపై వైసీపీ శ్రేణుల దాడి
ABN , First Publish Date - 2022-07-19T01:26:02+05:30 IST
జిల్లాలోని పులివెందులలో వాలంటరీపై వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలకు తమకు అందకుండా చేస్తావా అంటూ..
కడప: జిల్లాలోని పులివెందులలో వాలంటరీపై వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలకు తమకు అందకుండా చేస్తావా అంటూ.. నలుగురు వైసీపీ శ్రేణులు వాలంటీర్పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వాలంటీర్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.