ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
ABN , First Publish Date - 2022-05-31T01:48:26+05:30 IST
ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లా నిడమానూరుకు చెందిన మురళీ, నాగేంద్రగా గుర్తించారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుతున్నారు.