వ్యక్తి తలపై పడ్డ ఇటుక... పరిస్థితి విషమం
ABN , First Publish Date - 2022-06-29T21:40:47+05:30 IST
జిల్లాలోని యాడికి సమీపంలో విషాదఘటన చోటుచేసుకుంది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదావశాత్తు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.
అనంతపురం: జిల్లాలోని యాడికి సమీపంలో విషాదఘటన చోటుచేసుకుంది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదావశాత్తు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. పై అంతస్తులో నుంచి విధుల్లో వున్న ధర్మేంద్ర చౌహాన్ అనే కార్మికుడి తలపై ఇటుకలు పడ్డాయి. దాంతో తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ ఆస్పత్రి నుంచి కర్నూల్కు తరలించారు. బాధితుడి కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.